News December 1, 2025

రాజధాని జిల్లాగా మారుతున్న పల్నాడు.!

image

అమరావతి విస్తరణతో పల్నాడు జిల్లా రాజధాని జిల్లాగా మారనుంది. రెండో విడతలో అమరావతి మండలంలోని పెద్దమద్దూరు, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల నుంచి భూసమీకరణ చేయనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద రైల్వే స్టేషన్, బుల్లెట్ ట్రైన్, గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే జిల్లా మీదుగా వెళ్లనున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధిలో కీలక మలుపు తిరగనుంది.

Similar News

News December 3, 2025

చలికాలంలో చర్మం బాగుండాలంటే?

image

ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ వాతావరణంలో తేమ తగ్గిపోతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద లాంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే సెరమైడ్స్, షియా బటర్, హైలురోనిక్‌ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడాలి. పెదాలకీ విటమిన్‌ ఇ, షియాబటర్‌ ఉన్న లిప్‌బామ్‌ మంచిది. ఇవి చర్మానికి తేమని, ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. ఈ కాలంలో హెవీ క్రీములు కాకుండా మీ చర్మానికి సరిపడేవి రాసుకోవాలని సూచిస్తున్నారు.

News December 3, 2025

HYD: మౌలమేలనోయి.. అది శిక్షార్షమోయి!

image

నేరం జరిగిందని మీకు తెలుసా? మనకెందుకులే అని ఊరికే ఉన్నారా? అయితే మీరు నేరం చేసినట్లే లెక్క. తప్పు జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడమూ నేరమే. విచారణలో ఈ విషయం వెల్లడైతే మీపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తారు. జూబ్లీహిల్స్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనలో మౌనంగా ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు నిందితులుగా చేర్చారు. BNS సెక్షన్ 211, 33 ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు.

News December 3, 2025

అల్లూరి: పేరెంట్స్ మీట్‌కు రూ.54.92లక్షల విడుదల

image

అల్లూరి జిల్లాలో ఈనెల 5న జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌కు ప్రభుత్వం రూ.54.92 లక్షలు విడుదల చేసిందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని టీచర్స్&పేరెంట్స్ సహకారంతో నిర్వహించాలన్నారు. ప్రతీ పేరెంట్‌కు ఆహ్వానం అందించాలన్నారు. 2,913 ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం జరిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.