News February 9, 2026

రాజ‌ధాని ప‌నుల‌కు గ్రీన్ ఛాన‌ల్‌లో గ్రావెల్‌: కలెక్టర్

image

రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మంత్రులు,కార్య‌ద‌ర్శుల మూడో స‌ద‌స్సు జ‌రిగింది. ఈ సదస్సుకి కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖర్ మ్యూచువల్‌గా హాజరయ్యారు. ఈ సదస్సులో జరిగిన చర్చ సందర్భంగా గ్రావెల్, మెటీరియల్ స‌ర‌ఫ‌రాకు ఎక్క‌డా ఎలాంటి అడ్డంకులు లేకుండా జిల్లాలో తీసుకుంటున్న చ‌ర్య‌లను సీఎంకి వివ‌రించారు. ఇటీవ‌ల జిల్లా స్థాయి ప్ర‌త్యేక క‌మిటీ స‌మావేశం కూడా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.

Similar News

News April 20, 2026

@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

image

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.

News April 20, 2026

NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

image

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.

News April 20, 2026

సేంద్రియ మేళా సూపర్‌ హిట్: కలెక్టర్

image

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.