News December 30, 2025
రాజధాని ముఖద్వారంలో ‘న్యూ ఇయర్’ జోష్

రాజధాని ముఖద్వారంగా విరాజిల్లుతున్న మంగళగిరి న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతోంది. మంగళగిరి హాయిలాండ్, తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో ఈవెంట్ ఆర్గనైజర్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ గాయనీగాయకులతో లైవ్ షోలు, మ్యూజికల్ నైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ వేడుకల టికెట్లు ‘బుక్ మై షో’లో అందుబాటులో ఉండగా, వీటి ధర రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి.
Similar News
News February 19, 2026
అమరావతిలో పలు సంస్థలకు భూములు

అమరావతిలో వివిధ సంస్థలకు సబ్ కమిటీ భూములు కేటాయించింది. రెయిన్బో ఆసుపత్రికి 2ఎకరాలు, వాతావరణ శాఖ, నాబార్డ్లకు ఎకరం చొప్పున స్థలాలు ఇచ్చారు. పీఎన్బీ, కరూర్ వైశ్యా బ్యాంకులకు కూడా భూములు దక్కాయి. మొత్తం 22 ప్రతిపాదనలు చర్చించి, 7 కొత్త సంస్థలకు ఆమోదం తెలిపారు. 11 పాత కేటాయింపుల్లో మార్పులు చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఇళ్లకూ అనుమతిచ్చారు. ఇప్పటికే స్థలాలు పొందిన సంస్థల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు.
News February 19, 2026
ANU: బీ ఆర్కిటెక్చర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన బీ ఆర్కిటెక్చర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. 5/5 బీ ఆర్కిటెక్చర్ 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈ నెల 27వ తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.
News February 19, 2026
ANU దూరవిద్యలో 5 నూతన డిప్లమా కోర్సులు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం నూతనంగా 5 డిప్లమా కోర్సులతో ముందడుగు వేస్తుందని CDE డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ క్రమంలో ANU, అమెరికా కేంద్రంగా ఉన్న కనెక్ట్ కన్సల్టెంట్ ఐటి ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గురువారం అవగాహన ఒప్పంద కుదిరింది. సంబంధిత పత్రాలపై రిజిస్ట్రార్ సింహాచలం, కంపెనీ సీఈవో సుకుమార్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో VC గంగాధరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.


