News March 12, 2025
రాజనీతి శాస్త్రంలో నిర్మల్ వాసికి డాక్టరేట్

నిర్మల్ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్ కొండా గోవర్ధన్ ఇటీవల హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. రాజనీతి శాస్త్రంలో పొలిటికల్ అవేర్నెస్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ లీడర్షిప్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ మేరకు బుధవారం ఆయనను పలువురు మిత్రులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వామి, సాగర్రెడ్డి, మహేశ్, అశోక్ ఉన్నారు.
Similar News
News November 9, 2025
ట్యాంక్బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్సాగర్లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.
News November 9, 2025
ట్యాంక్బండ్ బుద్ధ విగ్రహం వద్ద థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

బౌద్ధ భిక్షువులు ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి బుద్ధ వందనం సమర్పించారు. రాజధాని నడిబొడ్డున ప్రశాంత వాతావరణంలో చారిత్రక హుస్సేన్సాగర్లోని బుద్ధుడిని సందర్శించి ప్రేరణ కలిగించడం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. హుస్సేన్సాగర్ బుద్ధ, ఇతర బౌద్ధారామాలు కలిపి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు.
News November 9, 2025
వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు: అదనపు కలెక్టర్

హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాలో 24 కంపెనీలు పాల్గొనగా 682 మంది యువతీ యువకులు నమోదు చేసుకున్నారు. వీరిలో 214 మందికి ఉద్యోగాలు దక్కాయి. వృత్తి విద్యతో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉపాధి పొందాలని అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి సూచించారు.


