News October 13, 2025
రాజన్న ఆలయ వివాదం.. KTR ఎక్కడా..?

వేములవాడ రాజన్న దర్శనాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల MLA KTR మౌనంగా ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓట్లు తప్ప మా మనోభావాలు మీకు పట్టవా సార్.. అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆలయ వివాదంపై BRS ఇప్పటికీ ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. కాగా, ఈ అంశంలో <<17985763>>BJPనేమో ధర్నాలతో రోడ్డెక్కింది. <<>>దీంతో స్వామివారి దర్శనాల వివాదం BJP VS CONGగా మారింది.
Similar News
News October 13, 2025
కాజీపేటలో వందే భారత్ స్లీపర్ కోచ్ల తయారీ కేంద్రం..!

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు ఆలోచిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ కోచ్లు కావాలని డిమాండ్ పెరుగుతుండటంతో కేంద్రంఈ ఆలోచన చేస్తోంది. దీనికోసం KZPT కోచ్ ఫ్యాక్టరీని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీలైనంత తొందరలో 200 భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో KZPTకు అరుదైన గౌరవం దక్కనుంది.
News October 13, 2025
HNK: లైంగిక వేధింపులకు పాల్పడిన ఉద్యోగిపై కేసు, వేటు

హనుమకొండ కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్పై సుబేదారి స్టేషన్లో SC, ST కేసు నమోదైంది. అదే సెక్షన్లో పని చేస్తున్న ఓ దళిత ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై గతంలోనే కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు. బాధితురాలు శనివారం రాత్రి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News October 13, 2025
ఇద్దరు సెంచరీ వీరులు ఔట్

ఢిల్లీలో భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ హీరోలు ఓపెనర్ క్యాంప్బెల్ (115), షై హోప్ (103) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలిన కరేబియన్ జట్టు ఫాలో ఆన్లో పోరాడుతోంది. ప్రస్తుతం విండీస్ స్కోర్ 289/4 కాగా 19 రన్స్ ఆధిక్యంలో ఉన్నారు.