News March 10, 2025
రాజన్న సిరిసిల్లకు మొండిచేయి..!

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. మంథని, చొప్పదండి, ధర్మపురి, జగిత్యాల, మానకొండూర్, పెద్దపల్లి, రామగుండంలో నిర్మిస్తున్న ప్రతి స్కూల్ కు రూ. 200 కోట్లు కేటాయించారు.. కాగా సిరిసిల్ల జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం నిధులు కేటాయించలేదు.
Similar News
News March 10, 2025
పదవి రాకున్నా CBNను దేవుడిగానే కొలుస్తా: బుద్ధా వెంకన్న

AP: తనకు MLC టికెట్ రాకపోవడంపై మాజీ MLC బుద్ధా వెంకన్న స్పందించారు. CM చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్నారు. రాజకీయ క్రీడలో ఒక్కోసారి పదవులు రావని చెప్పారు. కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడని, పదవి రాకున్నా CBNను దేవుడిగానే కొలుస్తానన్నారు. పదవి ఇస్తే ఒకలాగా, లేకపోతే మరోలా ఉండటం తనకు చేతకాదన్నారు. వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటామో, రానప్పుడూ అంతే హుందాగా ఉంటానని చెప్పారు.
News March 10, 2025
అనకాపల్లి జిల్లాలో 260 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఇంటర్మీడియట్ అనకాపల్లి జిల్లా అధికారిణి సుజాత తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు 260 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. మొత్తం 11,313 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,053 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
News March 10, 2025
ALERT: మూడు రోజులు జాగ్రత్త

తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఎండ వేడిమి నుంచి రక్షించుకునేందుకు అధికంగా నీరు తాగండి, చెప్పులు ధరించండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి. నీరు తాగినప్పటికీ దాహంగా ఉంటే ORS తాగడం బెటర్. టీ- కాఫీలాంటి వాటికి దూరంగా ఉండండి. అధిక ప్రొటీన్ ఆహారం కూడా వద్దు.