News October 5, 2025

రాజన్న సిరిసిల్లలో రేపు మంత్రి సీతక్క పర్యటన

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీతక్క ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు నేసిన చీరలను పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News October 5, 2025

సత్యదేవుని ఆలయంలో రథోత్సవం

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం నిర్వహించే రథోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వయంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వైభవంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు.

News October 5, 2025

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతు

image

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా.. కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News October 5, 2025

విశాఖలో వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ జోన్లు

image

‘<<17803065>>ఆపరేషన్‌ లంగ్స్‌<<>>’లో దుకాణాలు కోల్పోయిన వీధి వ్యాపారులకు 21 ప్రాంతాల్లో GVMC స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 649దుకాణాలకు స్థలాలను గుర్తించింది. చిరువ్యాపారులు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు వీలుగా ఈజోన్లు ఏర్పాటు చేశారు. UCDఆధ్వర్యంలో 8జోన్లలో మొత్తం 18,041 వీధి వ్యాపారులను గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు UCDకి 6,755 మంది మాత్రమే రూ.200 చెల్లించి గుర్తింపుకార్డు పొందారు.