News March 31, 2025

రాజన్న సిరిసిల్ల: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

SRCL జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 7,000 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News November 8, 2025

మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

image

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే NEETలో ఫెయిలైనందుకు UPకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రావత్‌పూర్‌లోని హాస్టల్ గదిలో మహమ్మద్ ఆన్(21) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News November 8, 2025

పెందుర్తి: అత్తను చంపి ఫైర్ యాక్సిడెంట్‌గా కథ అల్లిన కోడలు

image

పెందుర్తి పీఎస్ పరిధిలో కనకమహాలక్ష్మి అనే మహిళ అగ్ని ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. దేవుడి గదిలో దీపం పడి మంటలు చెలరేగడంతో తన అత్త చనిపోయినట్లు కోడలు లలితా దేవి పోలీసులకు చెప్పింది. అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా.. పాత గొడవలతో కోడలే అత్తను చంపి ప్రమాదంలో చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేసినట్లు తేలిందని సీఐ సతీష్ కుమార్ శనివారం తెలిపారు.

News November 8, 2025

మహానంది: కోడిపిల్లకు రెండు తలలు

image

ఒక కోడి 10 నుంచి 20 గుడ్లు పెడుతుంది. పొదిగే నుంచి పిల్లలను పెట్టే వరకు ఎన్ని పిల్లలకు జన్మనిస్తుందో అంచనా వేయలేం. కానీ మహానందిలోని అబ్బీపురంలో గురువయ్య ఇంట్లో ఓ కోడి పిల్లకు రెండు తలలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గురువారం జన్మించగా శుక్రవారం మృతి చెందిందన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతాయని పశు వైద్యాధికారులు తెలిపారు.