News March 16, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ బి.గీతేను ఆదివారం కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి రాజేశ్వర్ రావు, పొన్నం లక్ష్మణ్ గౌడ్, తిరుపతి యాదవ్, తిరుపతి ఉన్నారు.
Similar News
News March 16, 2025
మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్..!

HYD మెట్రోలో బెట్టింగ్ యాప్స్ యాడ్లు తీవ్ర వివాదాని దారితీశాయి. HML ఎండీ NVS రెడ్డికి బెట్టింగ్ యాప్స్లపై ఫిర్యాదులు చేసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ గ్రేటర్ HYD ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్ అని అధికారులను ప్రశ్నించారు. వీటితో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, యాప్స్ను నమ్మి మోసపోవద్దని అన్నారు.
News March 16, 2025
కోహ్లీ.. ఆ ఒక్క సెంచరీ చేస్తే

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ఐపీఎల్లో మరో సెంచరీ చేస్తే టీ20 ఫార్మాట్లో 10 శతకాలు చేసిన తొలి భారత ప్లేయర్గా నిలవనున్నారు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ(8) ఉన్నారు. కోహ్లీ IPLలోనే 8 సెంచరీలు, అంతర్జాతీయ క్రికెట్లో ఒక సెంచరీ చేశారు. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో గేల్(22), బాబర్(11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
News March 16, 2025
ASF: బాధ్యతలు స్వీకరించిన ధోని శ్రీశైలం

ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జిల్లా అధ్యక్షుడిగా ధోని శ్రీశైలం రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీశ్ బాబు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని ఉన్నత స్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్యామ్ సుందర్, శ్రీనివాస్, రఘునాథ్, తదితరులున్నారు.