News December 12, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో FINAL పోలింగ్ శాతం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 మండలాల్లోని 85 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్గా 79.57 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.
Similar News
News December 13, 2025
WGL: రెండో విడతలో 56 జీపీలు ఏకగ్రీవం!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో 56 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. హనుమకొండలో 73 జీపీలకు 5, 694 వార్డులకు 120, వరంగల్ 117కు 5, 1,008 వార్డులకు 97, జనగామలో 79కి 6, 710 వార్డులకు 155, మహబూబాబాద్లో 158కి 15, 1369 వార్డులకు 251, భూపాలపల్లిలో 85కి 10, 694 వార్డులకు 147, ములుగులో 52కి 15 జీపీలు, 1,686 వార్డులకు 147 మొత్తం 564 జీపీలకు 56, 4,937 వార్డులకు 917 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
News December 13, 2025
ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయి: టీజీ వెంకటేశ్

నేడు ప్రపంచ దేశాలు మోదీ పాలన వైపు చూస్తున్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం కర్నూలులోని అటల్-మోదీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్నూలు రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే మనకు బీజేపీ సహకారం ఎలా ఉందో కర్నూలు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మంత్రి టీజీ భరత్ కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నందున కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపారు.
News December 13, 2025
అధిక పాలిచ్చే పాడి గేదెను ఇలా గుర్తించండి

పాడి గేదెను కొనేటప్పుడు కొందరు దాని రూపం, అమ్మే వాళ్ల మాటలు నమ్ముతారు. తీరా ఇంటికి తెచ్చాక ఆశించిన పాల ఉత్పత్తి రాక మోసపోతుంటారు. అందుకే పాడి గేదెను కొనేముందు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. మూడు పూటలా పాల ఉత్పత్తి పరిశీలన, పొదుగు గుణం, పాల నరం పరిమాణం, పొదుగు వాపు లక్షణాలు, పాల చిక్కదనం కోసం ‘గోటి పరీక్ష’ వంటివి చేయాలంటున్నారు. వీటి పూర్తి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


