News November 30, 2025
రాజన్న సిరిసిల్ల: నేటి నుంచి 2వ విడత నామినేషన్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బోయినపల్లి మండలంలోని 23 GPలు, 212 వార్డులు, ఇల్లంతకుంట మండలంలో 35 GPలు, 294 వార్డులు, తంగళ్ళపల్లి మండలంలో 30 GPలు, 252 వార్డులలో ఎన్నికలకు డిసెంబర్ 2వ తేదీ వరకు ఉ.10:30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
Similar News
News December 1, 2025
NGKL: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మార్చాలా క్రీడాకారిణి

నాగర్కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికల్లో జడ్పీహెచ్ఎస్ మార్చాలాకు చెందిన 10వ తరగతి క్రీడాకారిణి డి.మౌనిక ప్రతిభ చూపింది. ఈమె నల్గొండ జిల్లా హాలియాలో రేపటి నుంచి జరగబోయే 51వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. నాగర్కర్నూల్ జట్టు తరఫున ఆమె ప్రాతినిధ్యం వహిస్తుందని హెచ్ఎం వెంకటరమణ తెలిపారు.
News December 1, 2025
MDK: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే ప్రచారం బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుందని, ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
VKB: అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు..!

సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


