News March 13, 2025

రాజన్న సిరిసిల్ల: ప్రజలు హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంగా, ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం, పరిచయం లేని వ్యక్తులపై రంగులు జల్లడం, బలవంతంగా రంగులు చల్లొద్దని అన్నారు. అనవసర గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News September 15, 2025

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి శాంతమ్మ (90) మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

News September 15, 2025

SRCL: ‘గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహారం వండాలి’

image

గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయ ఆవరణను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బిందికి సూచించారు.

News September 15, 2025

పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.