News March 11, 2025

రాజన్న సిరిసిల్ల: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

image

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. సిరిసిల్లలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!

Similar News

News November 6, 2025

వంటింటి చిట్కాలు

image

* పూరీలు తెల్లగా రావాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ, జంతికలు చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయిస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ వస్తాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించేముందు కాసేపు ఎండలో పెడితే నూనె పీల్చుకోకుండా ఉంటాయి.

News November 6, 2025

పున్నమి వెలుగుల్లో ధర్మపురి బ్రహ్మపుష్కరిణి

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి(కోనేరు) కార్తీక పౌర్ణమి వెలుగుల్లో కళకళలాడింది. పున్నమి చంద్రుడి కాంతులు నిర్మల జలాలపై ప్రతిబింబించి దివ్య రూపాన్ని సాక్షాత్కరించింది. కార్తీక పౌర్ణమి కావడంతో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా వెలిగి భక్తుల మనసులను ఆకట్టుకున్నాడు. దీపాల కాంతులు, చంద్రుని తేజస్సుల కలయికగా కోనేరు పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

News November 6, 2025

దోమకొండలో రేపు జిల్లా విలువిద్య పోటీలు

image

దోమకొండలోని గడి కోటలో శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విలువిద్య పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విలువిద్య అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల గౌడ్ తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 8 గంటల వరకు గండికోటలోకి రావాలని సూచించారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి పోటీలలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.