News February 24, 2025

రాజమండ్రిలో కోనసీమ వ్యక్తి మృతి

image

వెంకటనగరం వీఆర్‌వో గునపాటి మురళీకృష్ణ (49) ఆదివారం అనారోగ్యంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందారు. ఆయన స్వగ్రామం ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామం. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. మురళీకృష్ణ మృతి పట్ల రూరల్‌ తహశీల్దార్‌ సూర్యకుమార్, విఆర్‌వోలు, తహశీల్దార్‌ కార్యాలయం సిబ్బంది ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Similar News

News November 10, 2025

రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

image

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్‌ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.

News November 10, 2025

మక్తల్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభం

image

మక్తల్ మినీ స్టేడియం మైదానంలో సోమవారం ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను జిల్లా క్రీడల శాఖ అధికారి (డీవైఎస్‌ఓ) వెంకటేష్ ప్రారంభించారు. 14 నుంచి 17 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ క్రీడలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, విజేతలను ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News November 10, 2025

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

నారాయణపేట కలెక్టరేట్‌ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి 27 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ, వాటిని సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు.