News May 26, 2024
రాజమండ్రిలో దంపతుల అనుమానాస్పద మృతి
కాకినాడ జిల్లాకు చెందిన దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు. జగ్గంపేటకు చెందిన శ్రీధర్(28), ప్రత్తిపాడులోని ఒమ్మంగికి చెందిన దేవి(24)కి 8ఏళ్ల కింద పెళ్లి జరిగింది. వీరికి బాబు(7). మూడేళ్లుగా రాజమండ్రిలో ఉంటున్నారు. గొడవల వల్ల దేవి వారం కింద పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. శ్రీధర్ వెళ్లి శనివారం తిరిగి తీసుకొచ్చాడు. సాయంత్రం బంధువు ఒకరు ఇంటికెళ్లి చూడగా.. దంపతులిద్దరూ చనిపోయి ఉన్నారు.
Similar News
News October 10, 2024
చింతూరు: జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు మావోయిస్టులు
ఛత్తీస్గఢ్కు చెందిన ఇరువురు మావోయిస్టు దళ సభ్యులు ASP పంకజ్ కుమార్ మీనా ఎదుట గురువారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముచ్చిక అయిత, మడకం హింగే ఉన్నారని అధికారులు ప్రెస్ మీట్లో వెల్లడించారు. లొంగిపోయిన వారిని పోలీస్ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. మావోయిస్టులు ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం తరుపు నుంచి అన్ని రాయితీలు కల్పిస్తామని ASP అన్నారు.
News October 10, 2024
రాజమహేంద్రవరం: దసరాకు ప్రత్యేక రైళ్లు
దసరా సందర్భంగా గురువారం నుంచి 18వ తేదీ వరకు విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 07215 నంబరు గల రైలు విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఈ నెల 10, 11, 12, 13, 14, 15, 16, 17 తేదీలలో, 07216 నంబర్ గల శ్రీకాకుళం-విజయవాడ మధ్య 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో నడుపుతున్నామని తెలిపారు. ఈ రైళ్లు రాజమహేంద్రవరం మీదుగా తిరుగుతాయన్నారు.
News October 9, 2024
రాజనగరం: లారీ ఢీకొని లీగల్ పారా వాలంటీర్ మృతి
జాతీయ రహదారిపై ఆటోనగర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరొక మహిళ గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. లీగల్ పారా వాలంటీర్గా పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన పెనుగుల బేబీ ప్రశాంతి (50), జీఎస్ఎల్ ఆసుపత్రిలో పని చేస్తున్న ఆకుమర్తి సత్యవతి స్కూటీపై రాజానగరం నుంచి రాజమండ్రి ఇద్దరూ కలిసి వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రశాంతి అక్కడిక్కడే మృతి చెందిందని తెలిపారు.