News February 22, 2025

రాజమండ్రిలో రెండు జీబీఎస్ కేసులు నమోదు

image

రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం గులియన్ బారే సిండ్రమ్ జీబీఎస్ కేసులు కలకలం రేపాయి. జనరల్ మెడిసన్ విభాగాధిపతి పీవీవీ సత్యనారాయణ, న్యూరాలజిస్టు నీలిమ బాధితులకు పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారించారు. ధవళేశ్వరానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రికి చెందిన 38 ఏళ్ల వ్యక్తకి కాళ్లు చచ్చుబడినట్లు అనిపించడంతో జీజీహెచ్‌లో పరీక్షలు చేసి ధృవికరించారు. కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

Similar News

News February 22, 2025

కొవ్వూరు: హీరో రామ్‌ను కలిసిన మంత్రి దుర్గేశ్

image

కొవ్వూరు సమీపంలోని కుమారదేవంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో జరుగుతున్న #RAPO22 షూటింగ్‌కి వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి.మహేష్ బాబులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మంత్రి దుర్గేశ్‌కి ఘన స్వాగతం పలికింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

News February 22, 2025

తూ.గో: ‘కెమికల్ పరిశ్రమలపై తనిఖీలు నిర్వహించాలి’

image

జిల్లాలోని కెమికల్ ఆధారిత, ఇతర పరిశ్రమలను సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి, భద్రత ప్రమాణాలు, వాటినుంచి వెలువడే రసాయనాలను, వాయువులు స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంతి శనివారం రాజమండ్రిలో ఆదేశించారు. పరిశ్రమల్లో సాంకేతిక అంశాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించే లేదని కలెక్టర్ హెచ్చరించారు.

News February 22, 2025

తూ.గో: బ్యాడ్మింటన్ సాత్విక్ తండ్రి మృతికి మోదీ సంతాపం

image

అమలాపురానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథం మృతికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సంతాపం తెలిపారు. విశ్వనాథం మరణం పట్ల పీఎం విచారం వ్యక్తం చేస్తూ తండ్రి ప్రేరణతో సాత్విక్ సాయిరాజ్ బ్యాడ్మింటన్ ఆటగాడిగా ఎదిగిన విధానం ప్రస్తావించారు. విలువలు, కుటుంబానికి అందించిన మార్గదర్శకత, వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులను ప్రేరేపిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.

error: Content is protected !!