News March 16, 2025
రాజమండ్రి: అమెరికా నుంచి వచ్చానని అమ్మాయిలకు వల

అమ్మాయిలను మ్యాట్రిమోనీ, షాదీ డాట్కాం ద్వారా మోసగిస్తున్న రాజమండ్రికి చెందిన వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమెరికా నుంచి వచ్చానని, ఎన్నారైలను, రెండో పెళ్లికోసం చూస్తున్న వారి వద్ద డబ్బులు కాజేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగిన వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. వంశీపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి.
Similar News
News March 16, 2025
వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ను కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. గౌస్ ఆలం ఇటీవల కరీంనగర్ నూతన సీపీ బాధ్యతలు చేపట్టారు.
News March 16, 2025
పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర అనుసరణీయం: మంత్రి టీజీ భరత్

రాష్ట్ర సాధన కోసం కఠోర దీక్ష చేసి తెలుగు జాతికి స్ఫూర్తిగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర నేటి యువత అనుసరించాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకొని కర్నూలులోని పూల బజార్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 58 రోజుల పాటు నిర్విరామంగా అమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.
News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.