News February 28, 2025
రాజమండ్రి: ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

రాజమండ్రిలో పోలిశెట్టి సతీష్ అనే యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటీ కాలేజ్ రోడ్డు ముత్యాలమ్మ గుడి సమీపంలోని ఒక షాప్లో ఆ యువకుడు పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు పోలిశెట్టి రాణి, నాగేశ్వరరావులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టూ టౌన్ ఇన్స్స్పెక్టర్ మంగాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 1, 2025
పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
News November 1, 2025
పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: తూ.గో కలెక్టర్

‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. నవంబర్ 1వ తేదీ ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన 2,35,031 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని రాజమండ్రిలో ఆమె వివరించారు. ఇందుకోసం రూ.103.17 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


