News April 24, 2024
రాజమండ్రి: ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య

రాజమండ్రిలోని సిద్ధార్థ నగర్ కు చెందిన బొజ్జి మహాలక్ష్మి (63) ఒంటిపై పెట్రోలు పోసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుమారుడు బొజ్జి రాజశేఖర్ తన తల్లికి మతిస్థిమితం సరిగాలేదని, గత కొన్ని రోజులుగా చనిపోతానంటూ చెప్పేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News April 22, 2025
RJY: పోలీస్ సిబ్బందికి డ్రోన్ కెమెరాపై శిక్షణ

తూర్పు గోదావరి జిల్లాలో ఇకపై సాంకేతికత, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలు నియంత్రణకు వినూత్న కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ అన్నారు. సోమవారం ఆయన ఆదేశాలు మేరకు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాల ఆపరేటింగ్ పై సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.
News April 21, 2025
అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వొద్దు: కలెక్టర్

అర్జీలు పరిష్కారంలో అసంబద్ధ ఎండార్స్మెంట్లు ఇవ్వకూడదని, అటువంటి ఎండార్స్మెంట్లు జారీ చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వస్తున్న అర్జీలను స్వీకరించడం, వాటికి తగిన విధంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.
News April 21, 2025
తూ.గో. జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి తూ.గో. జిల్లాలో డీఎస్సీ ద్వారా 1,241 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-498 ➤ BC-A:88 ➤ BC-B:120 ➤ BC-C:13 ➤ BC-D:84 ➤ BC-E:48 ➤ SC-1:17 ➤ SC-2:79 ➤ SC-3:93 ➤ ST:74 ➤ EWS:120 ➤ PH-256:1 ➤ PH-05: 6. సబ్జెక్టుల వారీగా పోస్టుల కోసం << 16156039>>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.