News November 11, 2025

రాజమండ్రి, కాకినాడ రైళ్లు రద్దు

image

విజయవాడ-దువ్వాడ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈనెల 20న నాలుగు రైళ్లను రద్దు చేశారు. కాకినాడ పోర్ట్-విశాఖ(17267), విశాఖ-కాకినాడ పోర్ట్(17268), రాజమండ్రి-విశాఖ(67285), విశాఖ-రాజమండ్రి(67286) రైళ్లు ఆ తేదీన తిరగవు. ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ కోరింది.

Similar News

News November 11, 2025

నంద్యాల విద్యార్థినికి వైఎస్ జగన్ రూ.లక్ష ప్రోత్సాహకం

image

SSC-2025లో రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించిన నంద్యాల విద్యార్థిని షేక్ ఇష్రత్‌ (599/600) మంగళవారం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్ ఆమెను అభినందించి, రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించారు. మహిళలు చదువుకుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుందని, ఉన్నత లక్ష్యంతో చదవాలని జగన్ ఇష్రత్‌కు సూచించారు.

News November 11, 2025

బిహార్.. ఎన్డీఏదే గెలుపు!

image

* Matrize exit poll: ఎన్డీఏ 147-167, ఎంజీబీ 70-90
* People’s Insight: ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
* చాణక్య స్ట్రాటజీస్: ఎన్డీఏ 130-138, ఎంజీబీ 100-108
* POLSTRAT:ఎన్డీఏ 133-148, ఎంజీబీ 87-102
*CNN న్యూస్ 18: ఫస్ట్ ఫేజ్ (121)లో ఎన్డీఏ 60-70, ఎంజీబీ 45-55
* JVC EXIT POLL: ఎన్డీఏ 135-150, ఎంజీబీ 88-103

News November 11, 2025

మంచిర్యాల: వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2025’ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 12 నుంచి 19 వరకు వృద్ధుల వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నం.14567ను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.