News December 19, 2025
రాజమండ్రి: ‘క్లాట్’ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి ప్రభంజనం

రాజమండ్రి శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థలు ‘క్లాట్’ ఫలితాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సంస్థకు చెందిన డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ విద్యార్థిని ఎస్. శ్రీ సాయి గీతిక జాతీయ స్థాయిలో 3వ, రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో 100 లోపు ముగ్గురు, 500 లోపు 12 మంది ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు.
Similar News
News December 22, 2025
24 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఈ నెల 24న (బుధవారం) యాసంగి పంటలకు సాగు నీరు విడుదల చేయనున్నట్లు ఎస్ఈ జగదీష్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా నీటిని వదలనున్నారు. వారాబంది పద్ధతిలో నీటి సరఫరా కొనసాగుతుందని, రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయకట్టు రైతులకు మేలు చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News December 22, 2025
తప్పు చేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలదే: పొన్నం

TG: ఉనికిని కాపాడుకునేందుకే <<18633627>>KCR<<>> నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏమీ లేకుండా చేశారు. తప్పుచేసినవారి తోలు తీసే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. గత పాలకుల నిర్వాకంతో కలిగిన ఇబ్బందులను మేము సరిచేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలని కోరుతున్నాం’ అని గాంధీభవన్లో చెప్పారు.
News December 22, 2025
స్వయంకృషి: Tutor.. టైమ్, మ్యాటర్ ఉంటే చాలు

పిల్లలకు ట్యూషన్ చెబుతూ సాఫ్ట్వేర్ ఎంప్లాయి రేంజ్ ఆదాయం పొందొచ్చు తెలుసా. కావాల్సింది సబ్జెక్టుపై పట్టు, వివరించగల సామర్థ్యంతో పాటు సమయం. ఆఫ్లైన్, ఆన్లైన్లోనూ చెప్పొచ్చు. నగరాల్లో ఇంటికి పిలిపించి మరీ పిల్లలకు ట్యూషన్స్ పెట్టించేందుకు చాలామంది పేరంట్స్ రెడీగా ఉన్నారు. ఏదైనా పని చేస్తూ అదనపు ఆదాయంగా లేదా ఇదే పనిగా ఎంచుకొని ప్లానింగ్తో కెరీర్గా మార్చుకోవచ్చు.
-డైలీ 1pmకు ఓ బిజినెస్ ఐడియా


