News March 2, 2025

రాజమండ్రి: చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల

image

రాజమండ్రి రూరల్ రాజవోలు గ్రామానికి చెందిన సోడదాసి రమణ, కీర్తన దంపతుల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది. పేద దంపతులు అయిన వీరు అప్పులు బారిన పడి సతమవుతున్న స్థితిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంతో ఎమ్మెల్యే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి నేడు చెక్కును అందజేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నర్సిపల్లి హారిక తదితరులు ఉన్నారు.

Similar News

News March 3, 2025

నేడు పీజీఆర్‌ఎస్ రద్దు: కలెక్టర్ ప్రశాంతి

image

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు సంబంధిచిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసే వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించట్లేదని కలెక్టర్‌ ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, మండలాల్లో జరిగే గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు.

News March 2, 2025

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు: ఏలూరు కలెక్టర్

image

ఓట్ల లెక్కింపుపై పూర్తి అవగాహన చేసుకుని పారదర్శకతతో లెక్కింపు చేయాలని MLC ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి వెట్రిసెల్వి సిబ్బందిని ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది 3వ తేదీ ఉ.6 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఉ.8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

News March 1, 2025

తూ. గో : ఆర్టీసీకి శివరాత్రి ఆదాయం ఇలా..!

image

శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ. 13.78 లక్షలు అదనపు ఆదాయం సమకూరినట్లు రాజమండ్రి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె. షర్మిల అశోక ప్రకటించారు. తూ. గో జిల్లా ఆర్టీసీ రీజినల్ పరిధిలో రాజమండ్రి, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు డిపోల నుంచి మొత్తం 64 బస్సులు నడిపినట్లు చెప్పారు. 

error: Content is protected !!