News April 17, 2025

రాజమండ్రి: ‘జనరల్ వార్డుల్లోనే ప్రసవాలు జరగడం శోచనీయం’

image

స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేని దయనీయ స్థితిలో ఉందని మాజీ ఎంపీ భరత్ రామ్ విమర్శించారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ హయాంలో అన్ని వసతులు కల్పించడం వల్లే వైద్య సేవలు పేదలకు మరింత చేరువ అయ్యాయన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఆపరేషన్ థియేటర్లలో కాకుండా జనరల్ వార్డులలోనే ప్రసవాలు జరగడం దురదృష్టకరమన్నారు.

Similar News

News April 19, 2025

ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.

News April 18, 2025

తూ.గో. జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.

News April 18, 2025

RJY: డోర్‌ డెలివరీ కేసు.. ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల

image

ఏపీలో సంచలనం రేకెత్తించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు డోర్‌డెలివరీ కేసులో న్యాయ విచారణకు ఏపీ ప్రభుత్వం ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయ విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహాయం చేయడానికి ప్రత్యేక న్యాయవాదిగా ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సెల్ సభ్యుడు, మానవ హక్కుల రక్షణ కోసం పోరాటం చేస్తున్న ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది.

error: Content is protected !!