News January 18, 2025
రాజమండ్రి: పీఎం ఇంటర్న్ షిప్ గోడపత్రికలు ఆవిష్కరణ

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ద్వారా రాబోయే ఐదేళ్లలో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. శనివారం రాజమండ్రి కలెక్టర్ ఛాంబర్లో పీఎం ఇంటర్న్ షిప్ పథకం గోడ ప్రతులను జిల్లా పరిశ్రమల అధికారి రామన్, సహాయ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, నైపుణ్య అభివృద్ధి అధికారి పెరుమాళ్ళరావుతో ఆవిష్కరించారు.
Similar News
News May 8, 2025
తూ.గో: అవార్డు అందుకున్న కలెక్టర్

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆంధ్రపదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా ప్రశంపా పత్రం స్వీకరించారు. 2022-23 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడం కోసం చేసిన కృషిని గుర్తింపు లభించింది.
News May 7, 2025
రాజానగరం: ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు కేంద్రాలు ఏర్పాటు

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నిర్వహించే ఏపీ పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్షకు గైట్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో రెండు పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రామానుజం, వైస్ ప్రిన్సిపల్ టి.రామారావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GIET కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,791 మంది పరీక్ష రాయనున్నట్టు పేర్కొన్నారు.
News May 7, 2025
దేవరపల్లి: తల్లిదండ్రులకు నెలకు 5,000 చెల్లించండి

తల్లితండ్రులను వృద్ధాప్య దశలో చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ప్రశాంతి మండిపడ్డారు. శనివారం దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన కోలా వరలక్ష్మి, కృష్ణమూర్తి వయోవృద్ధుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్లో నమోదు అయ్యింది. కలెక్టర్ ఛాంబర్లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదుదారుడి సమక్షంలో కోర్టు నిర్వహించారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ప్రతి నెల ఐదు వేలు చెల్లించాలని ఆదేశించారు.