News January 31, 2025

రాజమండ్రి: పెళ్లి పత్రికపై YS జగన్, భారతి చిత్రాలు

image

రాజమండ్రికి చెందిన వైసీపీ నేత ముద్దాల తిరుపతిరావు మాజీ సీఎం జగన్ కుటుంబంపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఫిబ్రవరి 7న ఆయన కుమార్తె వివాహం జరగనుంది. ఈ సందర్భంగా జగన్, భారతి చిత్రాలను పెళ్లి పత్రికపై ముద్రించారు. వారి ఆశీస్సులతో తన కుమార్తె పెళ్లి జరుగుతోందని తిరుపతిరావు కార్డులో పేర్కొన్నారు. కాగా ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

Similar News

News November 6, 2025

ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

image

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్‌స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్‌లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్‌స్టాలో 14L, యూట్యూబ్‌లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.

News November 6, 2025

మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

image

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.

News November 6, 2025

కడప జిల్లాకు రానున్న శ్రీ చరణి

image

ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి రేపు కడప జిల్లాకు రానున్నట్లు కడప క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. రేపు కడపలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ ఉంటుందని చెప్పింది. అనంతరం స్టేడియంలో ఆమెకు సత్కారం చేయనున్నట్లు పేర్కొంది. ఆమెకు రాజంపేట రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు.