News November 10, 2024
రాజమండ్రి: రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్గా కుడుపూడి సత్తిబాబు

ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి రాజమండ్రికి చెందిన కుడుపూడి సత్తిబాబుకు దక్కింది. సత్తిబాబు టీడీపీ తెలుగు యువత, బీసీ సెల్ విభాగాలలో కీలకంగా పని చేశారు. టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్గా, శ్రీశైలం గౌడ సత్రం డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. తన తల్లి సరస్వతీ పేరిట సరస్వతమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
Similar News
News October 28, 2025
ఎలాంటి నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు: కందుల

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి శాఖ అధికారులు ప్రజలకు అండగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. రాజమండ్రిలోని కలెక్టర్ ఆఫీసులో తుఫాను సహాయక చర్యలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.
News October 28, 2025
ఎర్ర కాలువ పటిష్టతకు చర్యలు: మంత్రి కందుల

మొంథా తుఫాన్ ప్రభావం ధాటికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని మంత్రి కందుల దుర్గేశ్ మంగళవారం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్ర కాలువ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ఎర్ర కాలువ పరివాహక గ్రామాల రైతులకు, ప్రజలకు తాజా పరిస్థితిని క్రమం తప్పకుండా వెల్లడించాలన్నారు.
News October 28, 2025
అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి: తూ.గో కలెక్టర్

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సోమవారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలో 9 మండలాలు, 303 గ్రామాలు తుఫాన్తో ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 12 మండల కంట్రోల్ రూములు, 184 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.


