News August 6, 2024

’రాజమండ్రి విమానాశ్రయం లీజుకు’

image

దేశవ్యాప్తంగా 2022- 2025 మధ్యకాలంలో లీజుకు ఇవ్వాలని గుర్తించిన విమానాశ్రయాల్లో రాజమండ్రి విమానాశ్రయం ఒకటని కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. ఉత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకునేందుకే ఈ విమానాశ్రయాలను లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 21, 2025

రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

image

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.

News October 21, 2025

అమరవీరుల త్యాగాలు మరువలేనివి: తూ.గో. ఎస్పీ

image

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకుంటూ ఈ నెల 21న (మంగళవారం) పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. శాంతియుత సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని వారి త్యాగనిరతి అద్భుతమని ఆయన కొనియాడారు.

News October 19, 2025

తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

image

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.