News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.

Similar News

News February 11, 2026

రాజమండ్రి: తిట్టిన వారికి సెంట్రల్ జైలా?

image

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, కురసాల కన్నబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. “కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు” అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందిస్తూ.. తప్పు జరిగినట్లు తేలితే ‘దైవ ద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

News February 11, 2026

పట్టిసీమ: వీరభద్రేశ్వరుడుని దర్శించుకున్న ప్రముఖ సినీ రచయిత

image

ప్రసిద్ధ శైవక్షేత్రమైన పట్టిసీమ శ్రీ వీరభద్రేశ్వర స్వామిని రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త వీరభద్రరావుతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజానగరం ఇన్‌ఛార్జి వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.

News February 11, 2026

రాజమండ్రి: స్కూల్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

image

తూ.గో జిల్లాలో స్కూల్ బస్సులను తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలకు విరుద్ధంగా స్కూలు పిల్లలను తరలిస్తున్న 27 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1,16,030 అపరాధ రుసుము వసూలు చేశామన్నారు. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించడం రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఈ నిర్లక్ష్యపు రవాణా పద్ధతుల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు.