News August 21, 2025
రాజమండ్రి: 106 కుటుంబాలకు పునరావాస కేంద్రంలో ఆశ్రయం

గోదావరి వరదల కారణంగా రాజమండ్రిలోని ఏసీ గార్డెన్స్ ఎంపీఎల్ కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం తెలిపారు. మొత్తం 106 కుటుంబాలకు ఆశ్రయం కల్పించామని వారిలో పురుషులు 110, మహిళలు 111, పిల్లలు 72 మంది ఉన్నట్లు వెల్లడించారు. ఆర్డీవో, తహశీల్దార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
Similar News
News August 21, 2025
భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.
News August 21, 2025
రాజమండ్రి: ఈవీఎంల గోడౌన్ తనిఖీ

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పరిశీలించారు. గురువారం ఎఫ్సీఐ గోడౌన్లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్ పి. ప్రశాంతి, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, తహశీల్దార్ పాపారావు, ఇతర రెవెన్యూ సిబ్బంది పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.
News August 21, 2025
తూ.గో జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

గోదావరి వరదల నేపథ్యంలో రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్, కొవ్వూరు, రాజమండ్రి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 8977935611, రాజమండ్రి డివిజన్ 0883-2442344, కొవ్వూరు డివిజన్ 08813-231488, మునిసిపల్ కార్పొరేషన్ 9494060060 కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలన్నారు.