News October 28, 2025
రాజమండ్రి: BSNL వినియోగదారులకు గమనిక

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో BSNL నెట్వర్క్ సక్రమంగా పనిచేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అవసరమైన చోట్ల మొబైల్ జనరేటర్లు, ఏడు డివిజన్లలో ఏడు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ సమయంలో నెట్వర్క్ ఇబ్బందులు తలెత్తితే వినియోగదారులు 0883-2472200కు కాల్ చేయాలని కోరారు.
Similar News
News October 28, 2025
తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News October 28, 2025
తూ.గో జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం కూడా సెలవు ఇచ్చామని డీఈవో కె.వాసుదేవరావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 28, 2025
ఎలాంటి నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు: కందుల

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రతి శాఖ అధికారులు ప్రజలకు అండగా ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. రాజమండ్రిలోని కలెక్టర్ ఆఫీసులో తుఫాను సహాయక చర్యలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ పాల్గొన్నారు.


