News February 13, 2025
రాజాం : తండ్రిని చూసేందుకు వెళ్లి దారిలో మృతి

రాజాం కాంప్లెక్స్ ఆవరణలో కాలువలో బుధవారం మెరకముడిదాంకి చెందిన మజ్జి రామకృష్ణ మృతి చెందిన విషయం <<15436428>>తెలిసిందే<<>>. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు రామకృష్ణ రాజాం వచ్చాడు. కాంప్లెక్స్లో బైక్ ఉంచి బస్సులో వెళ్లాడు. రాత్రి తిరిగి కాంప్లెక్స్కి చేరుకున్నాడు. ఈక్రమంలో గుండెపోటు వచ్చి కాలువలో పడిపోగా ఎవరు చూడకపోవడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Similar News
News February 22, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు

రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ ఛైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.
News February 22, 2026
గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.
News February 22, 2026
గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.


