News February 20, 2025

రాజానగరం : రెండు లారీల మధ్య నలిగిపోయి వ్యక్తి మృతి

image

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమూరు గామన్ బ్రిడ్జిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు ఇనుప ఊచలు లోడుతో వెళ్తున్న లారీని డ్రైవర్ శ్రీనివాసరావు(45) రోడ్డు పక్కకు ఆపి, టైర్లలో గాలి చెక్ చేస్తుండగా మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో రెండు లారీల మధ్య నలిగి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని ఎస్ఐ మనోహర్ తెలిపారు.

Similar News

News December 20, 2025

బాపట్లలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం: DMHO

image

జిల్లాలో 0-5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైందని శనివారం బాపట్ల DMHO డాక్టర్ ఎస్. విజయమ్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,111 పోలియో బూత్‌లు, 4,662 మంది వ్యాక్సినేటర్లు, 113 మంది రూట్ సూపర్వైజర్లను నియమించామన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 42 ట్రాన్సిట్ బూత్‌లు, 67 మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

News December 20, 2025

IIT రూర్కీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>IIT <<>>రూర్కీ 9 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటినుంచి JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, ME, M.Tech, MCA, PhD(CS), PG, MD/MS, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుకు ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన వారు అర్హులు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitr.ac.in/

News December 20, 2025

ఒంగోలులో రూ.40వేల వేతనంతో జాబ్స్..!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. 10th నుంచి ఏదైనా డిగ్రీ చదివిన 18-35 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులు. జీతం రూ.40వేల వరకు పొందే అవకాశం ఉందన్నారు.