News September 25, 2024

రాజాపూర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి

image

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి శివార్లలోని నేషనల్ హైవే 44పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజాపూర్ మండలం చొక్కంపేట గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నేత వెంకటేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ముదిరెడ్డిపల్లి నుంచి మహబూబ్ నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. మృతదేహాన్ని బాదేపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News September 29, 2024

సీఎం ఫోటోలు కాదు.. 6 గ్యారంటీలు అమలు చేయండి: నిరంజన్ రెడ్డి

image

ప్రతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్టోబర్ 7లోపు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం వచ్చి 10నెలలైనా 6 గ్యారంటీల అమలుకు మాత్రం ఆదేశాలు లేవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలును పట్టించుకోని ప్రభుత్వం ఆగమేఘాల మీద సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు. ఇదే తరహాలో 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News September 28, 2024

రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి జూపల్లి

image

పానగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

News September 28, 2024

MBNR: ‘డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోండి’

image

DEECET 2024లో ర్యాంకు పొందిన అభ్యర్థులు రెండేళ్ల DIEEd కోర్సులో అడ్మిషన్ పొందడానికి, ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ చూసుకోని విద్యార్థులు వెంటనే వెరిఫికేషన్ చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ మహమ్మద్ మేరాజుల్లాఖాన్ తెలిపారు. డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ బ్యాచ్ 2024-26 వారికి అక్టోబర్ 1న వెరిఫికేషన్ ఉంటుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.