News December 21, 2025
‘రాజాసాబ్’ సినిమా బిజినెస్పై నిర్మాత క్లారిటీ

‘రాజాసాబ్’కు ఆశించిన దానికంటే తక్కువ ధరకు OTT డీల్ జరిగిందని నిర్మాత విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనిపై ఆయన Xలో స్పందించారు. ‘మేము ప్రొడక్షన్ ఖర్చులను బయటపెట్టం. మాకు, ఫ్యాన్స్కు థియేటర్ ఇంపాక్టే ముఖ్యం. రిలీజ్ తర్వాత స్క్రీన్లే మాట్లాడతాయి. కలెక్షన్లను అధికారికంగా ప్రకటిస్తాం. ఈ మూవీకి వచ్చిన నాన్-థియేట్రికల్ వాల్యూయే ప్రస్తుత మార్కెట్లో హైయెస్ట్’ అని పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
రేపు బాక్సింగ్ డే.. సెలవు

రేపు (డిసెంబర్ 26) బాక్సింగ్ డే సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ప్రకటించారు. దీంతో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే ఉంది. కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా సెలవులు కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.
News December 25, 2025
దేశంలో లక్షకు పైగా పెట్రోల్ పంప్స్

ఇండియా ఇంధన రిటైల్ మార్కెట్ చైనా, US తరువాత 3వ స్థానాన్ని ఆక్రమించింది. పదేళ్లలో అవుట్లెట్లు రెట్టింపై 1,00,266కు చేరాయి. ఇందులో 29% రూరల్ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతున్నాయని IOL మాజీ ఛైర్మన్ అశోక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ సహా CNG, EV ఛార్జింగ్ స్టేషన్స్ వంటివీ అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ అంశంలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం 10% లోపే ఉంది.
News December 25, 2025
రోజుకు 4.08 లక్షల లడ్డూల పంపిణీ: TTD ఛైర్మన్

AP: DEC 30 నుంచి ఆరంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలు, 8వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో వీటి తయారీని పెంచుతాం. లడ్డూల నాణ్యత, రుచి పెంచాం, క్యూలైన్లలో నిరీక్షణ తగ్గించాం’ అని పేర్కొన్నారు. ఆయన లడ్డూ తయారీ, విక్రయ కేంద్రాన్ని పరిశీలించి భక్తులతో మాట్లాడారు.


