News April 20, 2025
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్కు 21,120, ఎస్టీ కార్పొరేషన్కు 11,515, బీసీ కార్పొరేషన్కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్కు 253 దరఖాస్తులు వచ్చాయి.
Similar News
News September 11, 2025
NLG: మద్యం టెండర్లకు కసరత్తు

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News September 11, 2025
NLG: మద్యం టెండర్లకు కసరత్తు

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
News September 11, 2025
NLG: పాఠశాలలకు నిధులు మంజూరు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 2.79 కోట్లు మంజూరు చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి అందాల్సిన నిధులు ఆలస్యంగా విడుదలయ్యాయి. నల్గొండ జిల్లాలోని 1,068 పాఠశాలలకు రూ.1.25 కోట్లు, యాదాద్రి జిల్లాలోని 599 పాఠశాలలకు రూ.71 లక్షలు, సూర్యాపేట జిల్లాలోని 747 పాఠశాలలకు రూ.83.47 లక్షలు పాఠశాలల ఖాతాల్లో జమ కానున్నాయి.