News February 7, 2025
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.. గోదావరిఖని వాసులు మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి HYD వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న గోదావరిఖనికి చెందిన బాణేష్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
ఈనెల 17న విశాఖలో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఈనెల 17న విశాఖలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.15AMకి కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఆర్కే బీచ్ రోడ్డులో ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొంటారు. 12PMకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో ప్రసంగిస్తారు. అనంతరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్కు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.
News September 15, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హౌస్ అరెస్ట్
> రాష్ట్రీయ పోషణ్ మహ్ 2005 విజయవంతం చేయాలి: కలెక్టర్
> చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
> జిల్లా వ్యాప్తంగా విహెచ్పిఎస్ నేతల ధర్నా
> వాడి వేడిగా కొనసాగిన తాటికొండ రాజయ్య పాదయాత్ర
> చెక్కులను పంపిణీ చేసిన MLA యశస్విని రెడ్డి
> దిక్సూచి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
> పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట
News September 15, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బదిలీ
☞ కృష్ణా జిల్లా కొత్త ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణాలో13 మంది ఎంపీడీవోలకి పదోన్నతి
☞ కృష్ణాలో ఇంటి స్థలాల కోసం 19,382 దరఖాస్తులు
☞ వాట్సాప్లో కనకదుర్గమ్మ అర్జిత సేవ టికెట్లు
☞ కురుమద్దాలి ఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు