News March 26, 2024
రాజుపాలెం: గడ్డివామి దగ్ధం.. రూ.లక్ష నష్టం

రాజుపాలెంలో మంగళవారం సాయంత్రం గడ్డివామి దగ్ధమైంది. రైతు కాచన జయచంద్ర రెడ్డి పశువుల మేత కోసం గడ్డివామి ఏర్పాటు చేసుకున్నారు. అకస్మాత్తుగా గడ్డివామిలో నుంచి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారాన్ని ప్రొద్దుటూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపగా వారు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు లక్ష రూపాయలు నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 21, 2025
నేడు పోలీస్ సంస్మరణ దినోత్సవం: SP

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల దినోత్సవం మంగళవారం కడపలో నిర్వహించనున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సోమవారం తెలిపారు. ఉదయం పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొననున్నట్లు చెప్పారు.
News October 20, 2025
కడప: నేడు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు

దీపావళి పండుగ సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రద్దు చేస్తున్నామని అర్జీదారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
News October 19, 2025
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి YS జగన్ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా దీపాలు వెలగాలని, ఆనందాలు వెల్లువలా పొంగాలని అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.