News April 4, 2025
రాజేంద్రనగర్: గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రేవంత్

రాజేంద్రనగర్లో ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి సోదరుడు ఎలిగంటి వెంకట్రెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. సీఎంను మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పలువురు నాయకులు ఉన్నారు.
Similar News
News April 11, 2025
వికారాబాద్: ‘నాణ్యమైన ఉత్పత్తులే విక్రయించాలి’

నాణ్యమైన, స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్లోని ఆవరణలో విజయ తెలంగాణ పాల ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే విజయ డెయిరీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. విజయ విజయ డెయిరీ కేంద్రంలో నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని యాజమాన్యానికి కలెక్టర్ చూసించారు.
News April 11, 2025
జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు: అమిత్షా

తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి కోసం ఒకే నామినేషన్ దాఖలైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అన్నామలై సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటామని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లడంలో అన్నామలై భాగస్వామ్యం విలువైనవని పేర్కొన్నారు. కాగా ఒకే నామినేషన్ దాఖలు కావడంతో రేపు నైనార్ నాగేంద్రన్ను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.
News April 11, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,650

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర ఈరోజు కూడా పెరిగింది. గురువారం క్వింటా పత్తి ధర రూ.7,600 పలకగా.. ఈరోజు ₹50 పెరిగి రూ.7,650 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శుక్రవారం యార్డుకు రైతులు 193 క్వింటాళ్ల విడిపత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,650, కనిష్ఠంగా రూ.7,300 ధర పలికింది. గోనె సంచుల్లో 13 క్వింటాలు తీసుకురాగా.. రూ.5,800 నుంచి రూ.6,400 వరకు పలికింది.