News March 29, 2024

రాజేష్ మహాసేన పోస్ట్.. APR 1న ఏం చెప్పనున్నారు..?

image

రాజేష్ మహాసేన సోషల్ మీడియోలో పెట్టిన పోస్ట్‌పై ఆసక్తి నెలకొంది. ‘తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 2019లో జగన్ కోసం పని చేసి మోసం పోయాం. తర్వాత జనసేన కోసం కష్టపడ్డా అవకాశం రాలేదు. TDP నుంచి అనివార్య కారణాలతో అవకాశం కోల్పోయాం. అందుకే ‘మహాసేన’ చెప్పినట్లు చేయాలనుకుంటున్నా. అదేంటో APR 1న తెలిజయేస్తా’ అని రాసుకొచ్చారు. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News February 22, 2026

పరీక్షల వేళ డీజేలకు నో ఎంట్రీ.. ఎస్పీ హెచ్చరిక

image

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఆటంకం కలగకుండా ధ్వని కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. పోలీసు అనుమతి లేకుండా డీజేలు, ఆర్కెస్ట్రాలు, డాన్స్ బేబీ డాన్సులు, స్టేజ్ ప్రోగ్రాములు నిర్వహించరాదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

News February 22, 2026

రాజమండ్రి: ఎస్పీ వార్నింగ్.. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

image

జిల్లాలో రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు తమ అరాచకాలను మానుకోవాలని, లేనిపక్షంలో వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్‌హెచ్ఓల ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

News February 22, 2026

రాజమండ్రి: కలెక్టర్ ప్రకటన.. రేపు యథావిధిగా..

image

తూ.గో. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక), రెవెన్యూ క్లినిక్ సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహశీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయం నుంచి హాజరావుతారని వెల్లడించారు.