News October 14, 2025
రాజోలు: అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయమేనా..?

రాజోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యను టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించడం చర్చనీయాంశమైంది. గొల్లపల్లి అభిమానులను టీడీపీ వైపు తిప్పుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్లు వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. మరోవైపు తనయుడు శ్రీధర్కు కోఆర్డినేటర్ ఇవ్వాలని గొల్లపల్లి జగన్ను కోరడంతో.. రాజోలు బరిలో అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయంగా కనిపిస్తోంది.
Similar News
News October 14, 2025
మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులు: DEO

మెగా DSC ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకు 200 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించినట్లు DEO రాజ్ కుమార్ తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు 97 మంది, 103 మంది ఎస్జీటీలు జాయిన్ అయ్యారు. సాలూరులో 39, బలిజిపేటలో 20, గుమ్మలక్ష్మిపురంలో 18, గరుగుబిల్లిలో 8, జియ్యమ్మవలసలో 21, కొమరాడలో 9, కురుపాంలో 21, మక్కువలో 14, పాచిపెంటలో 28, పార్వతీపురంలో 19, సీతానగరంలో ముగ్గురు విధుల్లో చేరినట్లు చెప్పారు.
News October 14, 2025
ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కాలం!

ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ‘దామోదర మాసం’గా పరిగణిస్తారు. ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలమని భాగవతంలో ఉంది. ద్వాపర యుగంలో ఈ సమయంలోనే యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ని రోలుకు కట్టేసిన లీల జరిగింది. ఈ క్రమంలో దామమును(తాడును), ఉదరానికి కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు. ఈ పవిత్ర మాసంలో ఆయనను ‘దామోదర’ అనే నామంతో ఆరాధిస్తే అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
News October 14, 2025
SBIలో 63 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

SBIలో 63 మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు అప్లై చేయడానికి రేపటి వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ లేదా MBA/ PGDBA/ PGDBM/ CA/ ICWA/CFA, B.E/B.Tech/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు ₹750, SC, ST, PwBD ఫీజు లేదు. షార్ట్లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in/