News November 26, 2025
రాజోలు: పల్లె పండుగ 2.0లో ఉపముఖ్యమంత్రి పవన్ క

రాజోలు మండలం శివకోడులో కలెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో ‘పల్లె పండుగ 2.0’ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘పల్లె పండుగ 1.0’ అభివృద్ధి పనుల ఫోటో గ్యాలరీని ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
Similar News
News November 26, 2025
సంగారెడ్డి: స్థానిక దంగల్.. రేపటి నుంచి నామినేషన్స్

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రేపటి నుంచి మెదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 613 సర్పంచ్, 5,370 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 7,44,157 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,68,270, మహిళలలు 3,75,843, ఇతరులు 8 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటుంది.
News November 26, 2025
చెట్టు కోసం 363 మంది ప్రాణాలు కోల్పోయారు!

రాజస్థాన్ రాష్ట్ర వృక్షమైన హేజ్రీ చెట్టు ఉనికి వెనుక వందల మంది ప్రాణత్యాగం ఉందనే విషయం తెలుసా? 1730లో జోధ్పూర్ రాజు అభయ్ సింగ్ ప్యాలెస్ నిర్మాణానికి కలప సేకరించాలని సైనికులను పంపారు. ఇది తెలుసుకున్న బిష్ణోయ్ కమ్యూనిటీ సైనికులను అడ్డుకుంది. చెట్టును కౌగిలించుకుని నరకొద్దని కోరింది. సైనికులు వినకుండా 363 మందినీ నరికేశారు. ఇది తెలుసుకున్న రాజు చలించి చెట్లను నరకొద్దని ఆదేశించడంతో ఆ చెట్టు బతికింది.
News November 26, 2025
మున్సిపాల్టీల విలీనంతో HMDA ఆదాయానికి గండి

గ్రేటర్లో మున్సిపాల్టీల విలీనం తరువాత HMDA ఆదాయం కోల్పోనుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీల నుంచి HMDAకు ఆదాయం అధికంగా వస్తోంది. కేబినెట్ నిర్ణయంతో 27 మున్సిపాల్టీలో గ్రేటర్లో భాగం కానున్నాయి. అంటే.. హెచ్ఎండీఏ పరిధి కూడా తగ్గనుంది. ఈ క్రమంలో రాబడి కూడా తగ్గిపోతుంది. HMDAకు నెలనెలా సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుండగా.. విలీనం అనంతరం రూ.20 కోట్లకు పడిపోతుందని సమాచారం.


