News March 20, 2025
రాజ్భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్భవన్ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 18, 2026
NZB: కనిపించిన నెలవంక.. మోగిన రంజాన్ సైరన్

ముస్లింల అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడితో ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వగానే జిల్లాలోని అన్ని మసీదుల్లో సైరన్ మోగించి భక్తులకు సమాచారాన్ని అందించారు. రంజాన్ మాసం దృష్ట్యా జిల్లాల్లోని అన్ని మసీదులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
News February 18, 2026
నుడాలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు

నుడా పరిధిలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. వాటిల్లో రూ.28.60 కోట్ల పనులు మంజూరైనట్లు వివరించారు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్ష జరిగింది. జేసీ మాట్లాడారు. రాష్ట్రంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెంబర్ వన్గా తీర్చిదిద్దేందుకు అధికారులు అందరూ సహకరించాలన్నారు.
News February 18, 2026
సర్వంAI.. ఈసారి జెమినీ ఫ్లాష్, డీప్సీక్కు పోటీగా

ఇటీవల <<19088829>>అక్యూరసీలో<<>> చాట్జీపీటీ, జెమినీని బీట్ చేసిన సర్వంAI తాజాగా రెండు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) రిలీజ్ చేసింది. 30B, 105B అనే మోడల్స్ బడా ఏఐ మోడల్స్కు దీటుగా పనిచేస్తాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా 105B LLM జెమినీ 2.5 ఫ్లాష్, చైనాకు చెందిన డీప్సీక్ R1 మోడల్స్ కంటే సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చు కూడా వాటితో పోలిస్తే తక్కువేనని తెలిపింది.


