News November 26, 2024

రాజ్యాంగంతోనే భారతదేశానికి ఖ్యాతి: జాయింట్ కలెక్టర్

image

నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్ శంకరన్ హాల్లో ఇవాళ నిర్వహించిన రాజ్యంగ దినోత్సవం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడిందంటే దానికి కారణం భారత రాజ్యాంగమేనని అన్నారు. ప్రతిఒక్కరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తితో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పిలుపునిచ్చారు.

Similar News

News October 21, 2025

రేపు పాఠశాలలకు సెలవు: నెల్లూరు DEO

image

నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాజా బాలాజీ రావు తెలిపారు. వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News October 21, 2025

కావలిలో రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

image

కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, మృతురాలు పూర్తి వివరాలు తెలియాల్సింది.

News October 21, 2025

కందుకూరులో పోలీసులు అతి: YCP

image

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.