News February 2, 2025

రాత్రి కాజీపేట్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు

image

నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాజీపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి రైల్వే స్టేషన్‌లో తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులతో పాటు బ్యాగులను తనిఖీ చేశారు.  

Similar News

News November 7, 2025

చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

image

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్‌లో ఆమె ఓవరాల్‌గా 3వ స్థానంలో నిలిచారు.

News November 7, 2025

SUPER.. కర్నూలు ప్రిన్సిపల్‌కు 43 అవార్డులు

image

కర్నూలు బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నాగస్వామి నాయక్ విద్యా, సేవా రంగాల్లో చేసిన విశిష్ఠ కృషికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO) ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ అవార్డును గురువారం కర్నూలు ఎంపీ నాగరాజు చేతుల మీదుగా స్వీకరించారు. నాయక్ ఇప్పటివరకు 43 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కళాశాల ఉత్తీర్ణత శాతం 82.08% సాధించడంలో కీలక పాత్ర వహించారు.

News November 7, 2025

నంద్యాల: ఉచితంగా స్కూటీలు

image

దివ్యాంగుల సంక్షేమానికి CM చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ టెలికాం అడ్వైజరి కమిటీ మెంబర్ రమేశ్ పేర్కొన్నారు. గురువారం పాములపాడులో మీడియాతో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ఉచితంగా రెట్రో పిట్టెడ్ మోటార్ సైకిల్స్‌ను సీఎం ఉచితంగా అందజేస్తున్నారన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apdascac.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.