News December 20, 2025
రానున్న ఐదు రోజులు చలి ముప్పు

కర్నూలు, నంద్యాల జిల్లాలను చలి వణికిస్తోంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16-18 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. సాయంత్రం నుంచే చలి ప్రభావం మొదలవుతోంది. ఈ నెల 24 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-16°C నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News December 22, 2025
కామారెడ్డి: టెంపరేచర్ డౌన్.. ప్రజలు జాగ్రతగా ఉండాలి

కామారెడ్డి జిల్లాలో 17 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 10°Cల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యినట్లు వెల్లడించారు. మిగతా 17 ప్రదేశాల్లో ఎల్లో అలర్ట్ జారీ కాగా 15°Cల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, త్వరగా ఇళ్లకు చేరుకోవాలని తెలియజేస్తున్నారు.
News December 22, 2025
105 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా.. సీక్రెట్ ఇదే

స్వాతంత్ర్య సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి త్వరలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. వందేళ్లకు పైగా జీవించి ఇప్పటికీ పెన్షన్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న ఆయన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం శాకాహార భోజనం, మితాహారం, నిత్య వ్యాయామమే అని చెబుతున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.
News December 22, 2025
మెదక్: 492 పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

మెదక్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు నిర్వహించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని (ఆథరైజ్డ్ ఆఫీసర్) నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 492 గ్రామ పంచాయతీలకు ఆథరైజ్డ్ ఆఫీసర్లను నియమించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, మొదటి గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.


