News March 18, 2025
రాబిన్ హుడ్ డైరెక్టర్ది భద్రాద్రి జిల్లానే…

నితిన్ హీరోగా నటించిన మూవీ రాబిన్ హుడ్ ఈ నెల 28న విడుదలవుతోంది. కాగా ఆ మూవీని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుములది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట. కాగా ఆయన HYDలో ఉంటుండగా, పేరెంట్స్ అశ్వారావుపేటలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన భీష్మ, ఛలో సినిమాలు విజయం సాధించగా.. ఛలో మూవీకి ఉత్తమ తొలి దర్శకుడిగా సైమా అవార్డు అందుకున్నారు. కాగా ఆయన 2018లో ఛలో సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేయడం గమనార్హం.
Similar News
News November 15, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. సత్య నాదెళ్లకు ఆహ్వానం?

డిసెంబర్ 8, 9న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది. వచ్చేనెల నాదెళ్ల INDలో పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో ఆయన టూర్ షెడ్యూల్పై అధికారులు ఆరా తీస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నాదెళ్ల రాకపై క్లారిటీ రానుంది.
News November 15, 2025
ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్లకు ‘ఇటుక’ గుదిబండ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇటుక ధరలు పెనుభారంగా మారాయి. ఇటుక బట్టీల తయారీదారులు సిండికేట్గా ఏర్పడి ధరలను పెంచారు. 2500 ఇటుకల ధర గతంలో రూ.10,000 కాగా ప్రస్తుతం రూ.18,000 వరకు పెంచారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడిపై అదనంగా లక్ష రూపాయల వరకు భారం పడుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని, రాయితీపై ఇటుకలు సరఫరా చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
News November 15, 2025
దివ్యాంగుల రిజర్వుడ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు

AP: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని దివ్యాంగుల రిజర్వుడ్ ఖాళీలను ప్రత్యేక రిక్రూట్మెంటు ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ బ్యాక్లాగ్ కేటగిరీ పోస్టులను 2026 మార్చి 31లోగా భర్తీ చేయాలని సూచించింది. ఈమేరకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో 2024 మార్చి 31లోగా పోస్టుల భర్తీకి గడువు నిర్దేశించగా తాజాగా దాన్ని పొడిగించింది.


