News March 21, 2025
రాబోయే 4 సం.రాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి

ఖమ్మం: రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టి, రాబోయే 4 సం.లలో 20 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లను కట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మంత్రి పెనుబల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు, CC రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.
Similar News
News March 21, 2025
ఖమ్మంలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. పౌర సేవలను ప్రజలకు మరింతగా అందించేందుకు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోనల్ కార్యాలయ ఏర్పాటుకు శుక్రవారం మున్సిపల్ అధికారులతో కలిసి కమిషనర్ అనువైన భవనాలను పరిశీలించారు. ఆయా భవనాల్లో కార్యాలయాలను ఏర్పాటుచేసి సేవలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
News March 21, 2025
భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News March 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో మట్టా దయానంద్ పర్యటన ∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.