News September 20, 2025
రామగుండం అభివృద్ధిపై కలెక్టర్తో ఎమ్మెల్యే సమీక్ష

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్తో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతులు, విద్య, వైద్యం, రహదారులు, తాగునీటి సరఫరాపై చర్చించారు. మున్సిపల్ పరిధిలోని రహదారులు, పార్కులు, వీధిదీపాల పనులు వేగవంతం చేయాలని కోరారు. తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Similar News
News September 20, 2025
మిల్లర్లతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్

గత సీజన్లలో సీఎంఆర్ పూర్తి చేసి ఉండి, ఇపుడు బ్యాంకు గారంటీలు సమర్పించిన మిల్లర్లకే 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కేటాయించడం జరుగుతుందని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. డీఫాల్టర్లకు పెండింగ్ పూర్తి చేస్తేనే కొత్తగా ధాన్యం కేటాయించడం జరుగుతుందన్నారు.
News September 20, 2025
అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు: మంత్రి కొండపల్లి

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ హేతుబద్ధీకరణతో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఉపశమనం లభిస్తుందన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఎఈ పార్కులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక అధికారులను నియమిస్తామన్నారు.
News September 20, 2025
HYD: ‘దసరా సెలవులు.. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు’

దసరా సెలవుల వేళ TGSRTC బస్సుల ఛార్జీలు పెంచిందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ పేరుతో అదనపు బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఉప్పల్ నుంచి తొర్రూరుకు సూపర్ లగ్జరీలో టికెట్ రూ.300గా ఉంటే ఇప్పుడు రూ.430 తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్పెషల్ బస్సులన్నిటిలోనూ ఛార్జీల పెంపు ఉందని తెలిపారు.