News April 15, 2024

రామగుండం: రైలు కిందపడి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

రైలు కిందపడి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రామగుండంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జీ.తిరుపతి వివరాల ప్రకారం.. పట్టణంలోని భీమయ్య కాలనీకి చెందిన దండుగుల అంజి(29) ఆదివారం స్థానిక విద్యుత్ నగర్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కుటుంబంలో జరిగిన పరిణామాలతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మృతుడి భార్యలావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News October 8, 2024

డబుల్ డోస్‌తో నాని మూవీ: శ్రీకాంత్ ఓదెల

image

డబుల్ డోస్‌తో నాని మూవీ ఉంటుందని డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం చీకురాయిలో మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి డైరెక్టర్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రంతో నానితో ఉంటుందన్నారు. దసరాను మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం ఉండనుందని ఆయన తెలిపారు.

News October 8, 2024

జగిత్యాల: ఉపాధి కల్పనకు కసరత్తు

image

ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ కూలీలకు చేతినిండా పని కల్పించడానికి జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించారు. వచ్చే నెలలో మండలాల వారిగా ప్రణాళికలు ఖరారు చేయనున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్ కార్డుల పరిధిలో 2.73 లక్షల మంది కూలీలు ఉన్నారు.

News October 8, 2024

సిరిసిల్ల: పత్తి కొనుగోలు కేంద్రాలకు మౌలిక వసతుల కల్పన

image

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.