News March 21, 2025
రామచంద్రపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఆర్సీపురంలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ వెహికల్ ను ఆర్ఎంసి వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తున్న సాదు రవితేజ (36) తలపై నుంచి వాహనం పోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 28, 2025
నాడు వైఎస్సార్.. నేడు జగన్ పోలవరానికి అడ్డు: నిమ్మల

AP: 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు 72% పోలవరం పనులను పూర్తిచేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అప్పట్లో మధుకాన్ కాంట్రాక్ట్ను రద్దు చేసి YSR, 2019లో రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రాజెక్టుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇప్పటికీ జగన్ ముఠా సైంధవుల్లా పోలవరం పురోగతికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. 9 నెలల పాలనలోనే CBN ప్రాజెక్టుకు రూ.5,052 కోట్లు అడ్వాన్స్గా సాధించారని చెప్పారు.
News March 28, 2025
అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

అనకాపల్లి జిల్లాలో పోలీసుల సమస్యల పరిష్కారానికి ఎస్పీ తుహీన్ సిన్హాను శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పలువురు పోలీసులు పాల్గొని వారి సమస్యలపై ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎస్పీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
News March 28, 2025
రేపు భద్రకాళి ఆలయంలో ఒడిశాల బియ్యం వేలం

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిశాల బియ్యాన్ని ఈ నెల 29న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు ధరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం భద్రకాళి దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.